సంగారెడ్డి, 2026-08-26
సదాశివపేట పట్టణంలో ప్రముఖ కార్పెంటర్ యెన్నం మంగమ్మ, మల్లేశం దంపతుల కుమార్తె స్నేహ, నవీన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సదాశివపేట పట్టణంలోని శ్రీ బసవ సేవాసదన్ ఫంక్షన్ హాల్లో ప్రముఖ కార్పెంటర్ యెన్నం మంగమ్మ, మల్లేశం దంపతుల ఏకైక కుమార్తె స్నేహ, నవీన్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పులిమామిడి రాజు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన దంపతులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని పులిమామిడి రాజు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ వైద్యం గోపిప్రియాంక పవన్ కుమార్, నల్ల సాయి, శ్రీకాంత్ (గుట్ట), యెన్నం సాయిరాం, బూస శేఖర్, ఇటిక్యాల నర్సింలు, పుట్టపర్తిని రాజు, శ్రీనివాస్, పాశికంటి రజినీకాంత్, పండాల అనిల్, పీఎంఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, అఖిల్, టి. రాము, సోమ శంకర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.





